బ్రూస్‌లీకి శ్రీకారం

13 Oct, 2015 04:33 IST|Sakshi
బ్రూస్‌లీకి శ్రీకారం

జీవీ, ప్రకాష్‌కుమార్ బ్రూస్‌లీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. డార్లింగ్, త్రిష ఇల్లన్నా నయనతార చిత్రాల విజయాలతో యమ జోరుమీదున్న జీవీ.ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తదుపరి చిత్రం బ్రూస్‌లీ. కెనన్యా ఫిలింస్ పతాకంపై సెల్వకుమార్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ పాండిరాజ్ అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నారు. ఈయన నాళైయ ఇయక్కునార్ నాలుగవ సీజన్‌లో పోటీలో నిలిచారు.

ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన దర్శకుడు పాండిరాజ్ వద్ద ఇదునమ్మ ఆళు, పసంగ-2 చిత్రాలకు ప్రశాంత్ పాండిరాజ్ సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో జీవీ.ప్రకాష్‌కుమార్‌కు జంటగా కీర్తీ కర్భరదన నటిస్తున్నారు. బాలశరవణన్, మునీస్‌కాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం చెన్నైలో నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ పాండిరాజ్ చిత్ర వివరాలు వెల్లడిస్తూ ఇప్పటి వరకు హర్రర్, రొమాంటిక్ కథా చిత్రాలను చేసిన జీవీ.ప్రకాష్‌కుమార్‌ను ఈ బ్రూస్‌లీ చిత్రంలో వేరే కోణంలో చూపించనున్నానన్నారు. ఇది చిన్న పిల్లల్ని సైతం అలరించే విధంగా వినోదం, యాక్షన్ అంటూ డిఫరెంట జార్న్‌లో ఉంటుందని చెప్పారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుందని వెల్లడించారు.