మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ

3 Jun, 2019 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్‌ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున‍్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ సోమవారం హైదరాబాద్‌లోని మురళీమోహన్‌ నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునేంతవరకూ విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా మురళీమోహన్‌ను ఇప్పటికే సినీనటుడు చిరంజీవి దంపతులు పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

>
మరిన్ని వార్తలు