డి ఫర్‌ డెవిల్‌!

31 Aug, 2017 00:58 IST|Sakshi
డి ఫర్‌ డెవిల్‌!

దేవిశ్రీ ప్రసాద్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు సంగీత దర్శకుడు డీయస్పీ గుర్తొస్తారు. కానీ, ఇప్పుడాయన పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. అలాగని, ఇదేదో మ్యూజికల్‌ బేస్డ్‌ సిన్మా కాదు. డి ఫర్‌ డెవిల్, ఎస్‌ ఫర్‌ సస్పెన్స్‌లతో తెరకెక్కిన పి ఫర్‌ పక్కా హారర్‌ థ్రిల్లర్‌. పూజా రామచంద్రన్, మనోజ్‌ నందన్, భూపాల్‌ ముఖ్య తారలుగా శ్రీ కిశోర్‌ దర్శకత్వంలో ఆర్వీ రాజు, ఆక్రోశ్‌ నిర్మించిన థ్రిల్లర్‌ ‘దేవిశ్రీ ప్రసాద్‌’. ధనరాజ్‌ కీలక పాత్రధారి. అక్టోబర్‌లో సిన్మాను విడుదల చేయాలనుకుంటున్నారు.  ‘‘వినోదంతో పాటు సందేశంతో రూపొందిన చిత్రమిది. దేవి, శ్రీ, ప్రసాద్‌... అనే ముగ్గురు నటులు, లీలా రామచంద్రన్‌ అనే నటి చుట్టూ కథ నడుస్తుంది. సిన్మాలో ప్రతి సీన్‌ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు.