ఖుషీ కుమారి

31 Aug, 2017 01:26 IST|Sakshi
ఖుషీ కుమారి

కుమారి ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. కుమారి అంటే ‘కుమారి 21ఎఫ్‌’ ఫేమ్‌ హెబ్బా పటేల్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో హాట్‌ హాట్‌గా నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళ పరిశ్రమ నుంచి కుమారీకి ఓ కబురొచ్చిందట. ఆమె ఆనందానికి కారణం అదే. ఎందుకంత ఆనందం అంటే.. ఏకంగా స్టార్‌ హీరో విజయ్‌ సినిమాలో అవకాశం వచ్చిందని ఖబర్‌. విజయ్‌ హీరోగా మురగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందట. అందులో ఒక ఛాన్స్‌ను హెబ్బా పటేల్‌ దక్కించుకున్నారన్న ఖబర్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.