ఇర్ఫాన్‌ చివరి వరకు పోరాడాడు

29 Apr, 2020 20:43 IST|Sakshi

ముంబై: విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ మరణంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. క్యాన్సర్‌తో ఇర్ఫాన్‌ చివరి వరకు పోరాడాడని, ఆ బాధ తనకు తెలుసునని యువీ అన్నాడు. ‘ఈ ప్రయాణం గురించి నాకు తెలుసు. నొప్పి గురించి తెలుసు. చివరి వరకు అతను పోరాడాడని నాకు తెలుసు. కొంతమంది అదృష్టం బాగుండి మనుగడ సాగిస్తారు. కొంత మంది ప్రయాణం ఎంతవరకు సాగుతుందో కచ్చితంగా చెప్పలేం. ఇర్ఫాన్‌ ఖాన్‌ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాల’ని యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు. 

యువీ కూడా క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అతడికి క్యాన్సర్‌ సోకినట్టు 2011 వన్డే వరల్డ్‌కప్‌ సమయంలో బయటపడింది. అయినప్పటికీ పట్టుదలతో ఆడిన యువీ.. టీమిండియాను 28 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ దక్కించుకుని అందరి మన్ననలు పొందాడు. (ఇర్ఫాన్‌ ప్రేమకథ; కాలేజీ నుంచి కడవరకు..)

మరిన్ని వార్తలు