కమల్‌ హాసన్‌ ఫొటోలు వైరల్‌..!

2 Feb, 2020 12:20 IST|Sakshi

చైన్నై : ఇండియ‌న్ 2 సినిమాతో బిజీగా ఉన్న లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ తన చిన్ననాటి స్నేహితులతో సందడి చేశారు. పాఠశాల విద్యతోనే చదువు ఆపేసిన కమల్‌ తను చదవుకున్న స్కూల్‌కి ఇటీవల వెళ్లారు. పురసైవాక్కంలోని ఎంసీడీఎం పాఠశాలలో స్కూల్‌ ఫ్రెండ్స్‌ రీయూనియన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1970లో తనతో చదువుకున్న మిత్రులతో సరదాగా గడిపారు. వారిని పేరుపేరునా పలకరించి పాత ఙ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.


(చదవండి : రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేను)

ఫ్రెండ్స్‌తో కలిసి పాఠశాల మొత్తం కలియతిరిగారు. అందరూ కలిసి పాఠశాల యాజమాన్యానికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. 20 మంది పూర్వ విద్యార్థులతో పాఠశాలకు ప్రొజెక్టర్‌ బహూకరించారు. ఇక బాలనటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కమల్‌ దిగ్గజ నటుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన ప్రతిభ కనబరిచారు. ఇక ఈ రీ యూనియన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మరిన్ని వార్తలు