అడవిలో వేట!

24 Jan, 2019 01:22 IST|Sakshi
మహేశ్‌బాబు

మహేశ్‌బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం అవుతుంది. తాజాగా ఈ సినిమా కథనం సింహాచలం అడవుల నేపథ్యంలో సాగుతుందనే వార్త ప్రచారంలోకొచ్చింది. ఇది రీవెంజ్‌ డ్రామా అట. అంతేకాదు ఈ సినిమాలో మహేశ్‌బాబు లుక్‌ ఫుల్‌ గడ్డంతో ఉంటుందట. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే అడవిలో మహేశ్‌ వేట ఆడియన్స్‌కు మంచి కిక్‌ ఇస్తుందని చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తలు