జతగా...

13 Apr, 2019 00:49 IST|Sakshi
రాధిక,శరత్‌ కుమార్

20 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్‌ తర్వాత శరత్‌ కుమార్, రాధిక దంపతులు ఆన్‌ స్క్రీన్‌ కూడా జోడీగా నటించనున్నారు. గతంలో ‘నమ్మ అన్నాచ్చి, సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్‌ ఒరు నాళ్‌’ సినిమాలో శరత్‌కుమార్, రాధిక కలసి నటించినప్పటికీ జంటగా యాక్ట్‌ చేయలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ జంటగా విక్రమ్‌ ప్రభు హీరోగా ధన దర్శకత్వంలో ‘వానమ్‌ కొట్టటుమ్‌’ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మడోనా సెబాస్టియన్‌ కథానాయిక. ఈ చిత్రానికి కథ– మాటలు మణిరత్నం, ధన సమకూర్చారు. జూలైలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

మరిన్ని వార్తలు