టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్స్టార్ రామ్చరణ్లతో దర్శక ధీరుడు జక్కన్న భారీ మల్టీస్టారర్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యుల్లో పోరాట సన్నివేశాల్ని చిత్రీకరించిన బృందం.. తాజాగా రెండో షెడ్యుల్ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులకు ఓ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జీ నెట్వర్క్ సంస్థ తెలుగు, తమిళ, హిందీ శాటిలైట్ హక్కులకు దాదాపు 150కోట్లను ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే నిర్మాత దానయ్య మాత్రం ఈ డీల్ను హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తోంది. జక్కన్న ఈ సినిమాను డైరెక్ట్చేయడం, ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా ఉండటంతో ఈ రేటు పలకడం మాములు విషయమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.