పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సమీరా రెడ్డి

12 Jul, 2019 20:48 IST|Sakshi

నటి సమీరా రెడ్డి ఈ రోజు ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు సమీరా రెడ్డి. కుమార్తె చేయి పట్టుకుని ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు సమీరా. ‘ఈ రోజు ఉదయం మా లిటిల్‌ ఏంజెల్‌ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మీరు చూపిన ప్రేమకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అని పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సమీరాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ దేవుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి’ అని కామెంట్లు చేశారు.
 

Our little angel came this morning 🌸My Baby girl ! Thank you for all the love and blessings ❤️🙏🏻 #blessed

A post shared by Sameera Reddy (@reddysameera) on

సమీరా ‘నరసింహుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తర్వాత ‘జై చిరంజీవ’, ‘అశోక్‌’ చిత్రాల్లో నటించారు.  2014లో అక్షయ్‌ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. 2015లో ఈ దంపతులకు కుమారుడు హాన్స్‌ జన్మించాడు.

>
మరిన్ని వార్తలు