శ్వేతామీనన్ నిరీక్షణ

16 Dec, 2015 23:14 IST|Sakshi

హారర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. శ్వేతామీనన్ ముఖ్య పాత్రలో పర్స రమేశ్ దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీపడకుండా  ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం.

ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, ఏప్రిల్ నెలలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బసంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ: అనిత్, సంగీతం: భోలే.