రెండు జంటల ప్రేమకథ

25 Jan, 2019 03:02 IST|Sakshi
శుభాంగి పంత్, అరవింద్‌ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, దీక్షితా పార్వతి, అజిత్‌ రాధారామ్‌

‘‘ప్రేమకథలు ఎన్నిసార్లు చెప్పినా బోర్‌ కొట్టవు. ట్రెండ్‌కు తగ్గట్టుగా దర్శకులు అప్‌డేట్‌ అవుతూ ప్రేమ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు. అలా న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’’ అని నిర్మాత అల్లూరమ్మ (భారతి) అన్నారు. అరవింద్‌ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్‌ రాధారామ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రల్లో అవినాష్‌ కోకటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’. తీర్థసాయి ప్రొడక్షన్స్‌ పతాకంపై అల్లూరమ్మ (భారతి) నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్స్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ‘తొలితొలిగా...’ పాటను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘ఈ పాట చాలా బాగుంది.  సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారాయన.

‘‘రెండు జంటల మధ్య ప్రేమకథను ఈ తరానికి నచ్చేలా తెరకెక్కించిన సినిమా ఇది. ఎంటరై్టన్మెంట్‌ తగ్గకుండానే ప్రేమకథలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. లవ్‌స్టోరీలో ఎమోషన్స్‌కు ఎప్పుడూ ఎక్కువ స్కోప్‌ ఉంటుంది. అలాంటి ఎమోషనల్‌ అంశాలు మా చిత్రంలో ఉంటాయి. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని అవినాష్‌  కోకటి అన్నారు. సుదర్శన్, ‘ఈ రోజుల్లో’ సాయి, కేధార్‌ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్‌ విట్టా ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంగీతం: శ్రీనివాస్‌ శర్మ, కెమెరా: శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తేజేశ్వరి అన్నపురెడ్డి, సహ నిర్మాతలు: సోమశేఖర్‌ రెడ్డి, అల్లూరి రెడ్డి. ఏ.

మరిన్ని వార్తలు