భారతిరాజా దర్శకత్వం వహించిన తాజ్మహాల్ చిత్రంలో మనోజ్కు జంటగా నటించిన ఉత్తరాది భామ రియాసేన్. ఆ చిత్రంలో అమ్మడు మత్స్యకన్యగా నటించి, చూపీచూపని అందాలతో కుర్రకారుకు మత్తెక్కిందింది. తర్వాత ప్రశాంత్ నటించిన గుడ్లక్, అరసాచ్చి వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తమిళంలో అవకాశాలు తగ్గడంతో అమ్మడు వచ్చిన చోటుకే వెళ్లిపోయింది. అక్కడ హిందీ, బెంగాళీ చిత్రాల్లో నటిస్తున్న రియాసేన్కు ఇటీవల అక్కడ కూడా అవకాశాలు తగ్గాయట. కాగా సినీ వర్గాల్లో కలకలం రేపే విధంగా బాలీవుడ్ భామలు అదరగొట్టే ఫొటోలను విడుదల చేస్తున్న విషయం తెలిసింది.
అదేవిధంగా రియాసేన్ కూడా తన ఇన్స్ట్రాగామ్లో తాజాగా యువతను కవ్వించే రీతిలో ఒక ఫొటో విడుదల చేసింది. అందులో అమ్మడు టాప్లెస్గా వీపు అందాన్ని చూపుతూ... ముందు వైపు తిరిగితే ఇంకెలా ఉంటుందో.. అనేంతలా ఫోజిచ్చింది. యువత నరనరాలను జువ్వున లాగేసేలా ఉన్న ఈ ఫొటోతో అమ్మడు అటు ఉత్తరాది అభిమానులనే కాకుండా దక్షిణాదిని ఉన్న ఆమె అభిమానులను కూడా రియాసెన్ ఆకట్టుకుంటోంది. తమిళంలో అవకాశం ఇస్తే రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతానని అంటున్న అమ్మడుపై మన దర్శకులు కన్నుపడుతుందేమో చూడాలి.