బిజీ నితీన్‌

22 Mar, 2019 00:33 IST|Sakshi
నితిన్‌

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తర్వాత ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించనున్నారు నితిన్‌. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుండగా మరో రెండు సినిమాలను ప్రకటించారాయన. ‘‘చంద్రశేఖర్‌ యేలేటిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌గారు ఈ చిత్రం నిర్మిస్తారు. ఎం.ఎం. కీరవాణిగారు సంగీతం అందించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. ఏప్రిల్‌లో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’ అన్నారు నితిన్‌.

అలాగే ‘రైడ్, ఒక ఊరిలో, వీర’ వంటి సినిమాలను తెరకెక్కించిన రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం అంగీకరించారు నితిన్‌. హవీష్‌ లక్ష్మణ్‌ కోనేరు ప్రొడక్షన్‌లో ‘ఎ’ స్టూడియోస్‌ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. నితిన్‌ నటించిన ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల తరహాలో ఉంటుంది. ఆగస్ట్‌లో  రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. నటరాజన్‌ సుబ్రహ్మణ్యం (నట్టి) కెమెరామేన్‌గా పని చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు