పదునైన కథ...

2 Feb, 2015 23:12 IST|Sakshi
పదునైన కథ...

మాస్, యాక్షన్ కథాంశాలతో వస్తున్న చిత్రం ‘వేటకొడవళ్లు’. పీపుల్స్ థియేటర్ పతాకంపై బాబ్జీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా  రెండో షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ -‘‘విద్రోహ శక్తులతో చేరి అనాథ పిల్లలు వేటకొడవళ్లుగా ఎలా మారుతున్నారనేది ఈ చిత్రం కథాంశం. వాణిజ్య అంశాలున్న ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంది. పదునైన కథ ఇది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గజ్వేల్ వేణు, కెమెరా: కిషన్ సాగర్, సహనిర్మాత: ఎస్.పి. సుబ్బారాయుడు.