ఆత్మ సంతృప్తి కలిగించింది | Sakshi
Sakshi News home page

ఆత్మ సంతృప్తి కలిగించింది

Published Mon, Feb 2 2015 11:05 PM

ఆత్మ సంతృప్తి కలిగించింది

 ‘‘నెల రోజుల వ్యవధిలో మా సంస్థ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యాయి. గత నెల ‘ఒక రోజు ఏం జరిగింది’, ఇటీవల ‘అయ్యప్ప దర్శనం’ విడుదల చేశాం. రెండూ చిన్న చిత్రాలే అయినప్పటికీ మంచి ఆదరణ లభించింది’’ అని నిర్మాత తడకల రాజేశ్ చెప్పారు. వీటిలో ‘ఒక రోజు ఏం జరిగింది’కి ఆయనే దర్శకుడు. చిత్రపరిశ్రమకు వచ్చి పదేళ్లయ్యిందనీ, వేట, ఉడుతా ఉడుతా ఊచ్.. ఇలా పలు చిత్రాలు నిర్మించాననీ రాజేశ్ అన్నారు. ముఖ్యంగా ‘అయ్యప్ప దర్శనం’ నిర్మించడం ఆత్మసంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు చిన్న చిత్రాల ద్వారా సాధించిన అనుభవంతో, ఇప్పుడు మీడియం బడ్జెట్ చిత్రం నిర్మించబోతున్నానని చెప్పారు. ఈ చిత్రానికి కథ సిద్ధమైందనీ, ఓ ప్రముఖ హీరో ఇందులో నటిస్తారని రాజేశ్ అన్నారు. వచ్చే నెల ఈ చిత్రాన్ని ప్రారంభిస్తానని రాజేశ్ తెలిపారు.
 

Advertisement
Advertisement