హిట్‌ అండ్‌ రన్‌ కేసు: ఇద్దరు మృతి

1 May, 2016 16:08 IST|Sakshi

తిరునెల్వలి: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడులో నాగనూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో తిరునెల్వలి ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను ఎదురుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

విజయనారాయణ గ్రామం నుంచి బైక్‌పై తిరిగివస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఎస్‌. పరమశివన్‌ (18), సుదలిముత్తు (17) అనే ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు