లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన అక్కడికి వచ్చి టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో మంతనాలు జరిపారు. ఆయన సూచనల మేరకు ఇరు ప్రాంతాల సభ్యులు సభలో వ్యవహరించినట్లు తెలిసింది.