కోల్‌కత్తాలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

26 Dec, 2015 21:55 IST|Sakshi
కోల్‌కత్తాలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

కోల్‌కత్తా: కోల్‌కత్తాలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దమ్‌దమ్‌ పార్క్‌ సమీపంలో ఉన్న మురికివాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు మృతిచెందినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 12 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

అందిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో కనీసం 8 గ్యాస్‌ సిలీండర్లు పేలినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు