బాలిక నాలుక కోసి, కళ్లు పీకి..

14 Jul, 2016 08:56 IST|Sakshi
బాలిక నాలుక కోసి, కళ్లు పీకి..

గుర్గావ్: అతడు ఒక దుకాణం దారుడు. ఎందుకో తెలియదు.. గత కొద్ది రోజులుగా ఓ కుటుంబం దగ్గరకు వెళ్లి ’మీ కూతురును నాకు అమ్మేయండి’ అంటూ తెగ ఇబ్బంది పెట్టాడు. వారు అందుకు నిరాకరించడంతో ఎన్నో ప్రలోభాలకు గురిచేశాడు. అయినా వారు ఒప్పుకోలేదు. ఫలితంగా ఆ పాపను అతడే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అనంతరం చిత్ర హింసలు పెట్టి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన హర్యానాలోని గుర్గావ్ లో చోటుచేసుకుంది. ఈ నెల 10న ఓ నాలుగేళ్ల బాలిక కనిపించకుండా పోయింది.

దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపులు చేపట్టిన పోలీసులకు ఆ పాప మృతదేహం కనిపించింది. పాప శరీరంపై తీవ్రంగా గాయాలు ఉన్నాయి. చిత్ర హింసలకు గురిచేసిన ఆనవాళ్లు ఉన్నాయి. దాంతోపాటు పాప నోట్లో నాలుక, కళ్లు మాయమయ్యాయి. చేతి నిండా గాజులు తొడిగి ఉన్నాయి. ఒక రకమైన అలంకరణ చేసినట్లుగా ఉంది. దీంతో పోలీసులకు ఆ కుటుంబ సభ్యులు అసలు విషయం చెప్పారు.

తాము ఉంటున్న వీధిలోనే దుకాణం నడిపే ఓ 40 ఏళ్ల వ్యక్తి తమ కూతురుని అమ్మేయాలని ప్రతి రోజు ఒత్తిడి చేశాడని, అతడి ఎత్తుకుపోయి తమ చిన్నారిని చిదిమేశాడని ఆరోపించారు. క్షుద్రపూజల కోసం తమ బిడ్డను బలిచ్చి ఉంటారని చెప్పారు. అయితే, క్షుద్ర పూజలు అనే ఆరోపణలు కొట్టి పారేసిన పోలీసులు ఆ వ్యక్తిపై హత్య కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి అసలు ఆ వ్యక్తి ఏం చేశాడనే విషయాన్ని రాబడుతున్నారు.

మరిన్ని వార్తలు