ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు‍ నక్సల్స్‌ మృతి

19 Nov, 2016 12:50 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌: మవోయిస్టులుకు మరో ఎదురుదెబ్బ తగలింది. నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా రెండు రోజుల క్రితం దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్‌లో ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో 32మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు