ర్యాంకుల వ్యవస్థలో మార్పులుండవు

28 Oct, 2016 17:40 IST|Sakshi

న్యూఢిల్లీ: సాయుధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) సిబ్బంది ర్యాంకుల వ్యవస్థలో మార్పులేమీ ఉండవని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎవరి ర్యాంకునూ తగ్గించడం, మార్పులు చేయడం లేదని తెలిపింది.

సాయుధ దళాల ప్రధాన కార్యాలయాల్లో అదే హోదాలో పనిచేస్తున్న రక్షణేతర రంగ ఉద్యోగులకు ఇచ్చిన ర్యాంకులనే, ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగిస్తామని రక్షణ శాఖ తెలిపింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమంది. మంత్రిత్వ శాఖ ఇలా ప్రకటించినా, సాయుధ దళాలు మాత్రం ఈ విషయంలో రక్షణ శాఖ ఇచ్చిన ఒక సర్క్యులర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు