కజరంగా పార్క్లో ప్రిన్స్ దంపతుల సందడి

13 Apr, 2016 11:45 IST|Sakshi
కజరంగా పార్క్లో ప్రిన్స్ దంపతుల సందడి

అసోం: బ్రిటన్ యువరాజ్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతులు బుధవారం అసోంలోని కజరంగా నేషనల్ పార్క్ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్లోని అధికారులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన దృశ్యాలను వీక్షిస్తూ సందడి చేశారు. బ్రిటన్ యువరాజు సతి సమేతంగా పార్క్కు రావడంతో అక్కడి అధికారులు ముందుగానే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఈ నేపథ్యంలో నేషనల్ పార్క్కు సందర్శనానికి వచ్చిన బ్రిటన్ యువరాజు దంపతులను కలిసి మాట్లాడటం తమకు గొప్ప అనుభవమని అక్కడి అధికారుల్లో ఒకరు సంతోషం వ్యక్తం చేశారు. కాగా,  కజరంగా పార్క్లో ఫారెస్ట్ రేంజర్లు నిత్యం అవలభించే విధివిధానాల గురించి యువరాజు దంపతులు అడిగి తెలుసుకున్నారు.

>
మరిన్ని వార్తలు