సాధువు, సాధ్విలపై హత్యకేసు నమోదు!!

28 May, 2014 17:31 IST|Sakshi

ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ సమీపంలో గల ఓ ఆశ్రమంలో సాధువు హత్యకేసులో మరో సాధువు, సాధ్విలను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. షుకర్తల్లో ఓం బ్రహ్మచారి (38) అనే సాధువు ఇటీవల హత్యకు గురయ్యాడు. అతడి సోదరుడు సాధు ఓమన, సాధ్వి అనుసూయ అనే ఇద్దరిపై ఫిర్యాదు దాఖలు చేశాడు.

వాళ్లిద్దరికీ అక్రమ సంబంధం ఉందని, దాని గురించి ఓం బ్రహ్మచారికి తెలిసిందని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏప్రిల్ 26వ తేదీన బుల్లెట్లతో నిండిన బ్రహ్మచారి మృతదేహం షుకర్తల్ ఆశ్రమం వద్ద కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు