లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరు: ఎస్పీ

23 Dec, 2013 00:54 IST|Sakshi

 ఫరూఖాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒంటరిగానే పోటీ చేస్తుందని, మరే ఇతర పార్టీ సాయం తమకు అక్కర్లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి శివపాల్‌సింగ్ యాదవ్ తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పీడబ్ల్యూడీ, ఇరిగేషన్, సహకార శాఖల్లో అవినీతి చాలావరకు తగ్గిందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు