టుడే న్యూస్‌ రౌండప్‌

11 May, 2017 10:11 IST|Sakshi

మోదీ శ్రీలంక పయనం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు శ్రీలంక వెళ్లనున్నారు. బౌద్ధుల అతి పెద్ద ఉత్సవం వేసాక్‌ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరవనున్నారు.

నిశిత్‌ అంత్యక్రియలు
నేడు ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిశిత్‌ భౌతికకాయానికి పెన్నా నదీ తీరంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ఎంసెట్‌ టెస్టు
రేపు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

ఆమోదం కోసం
జీఎస్టీ బిల్లును ఆమోదించడం కోసం ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది.

రాహుల్‌ రాక
జూన్‌ 1న సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారు.

వెబ్‌ ఆప్షన్లకు తేదీ ఖరారు
ఎండీఎస్‌ సీట్లకు ఈ నెల 13 నుంచి వెబ్‌ ఆప్షన్లు స్వీకరించనున్నట్లు విజయవాడ హెల్త్‌ యూనివర్సిటీ పేర్కొంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ హాల్‌ టికెట్లు
అధికారిక వెబ్‌సైట్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

టెక్నాలజీ నమో నమః
రూరల్‌ టెక్నాలజీ పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు కానున్న రూరల్‌ టెక్నాలజీ సెంటర్

ప్లే ఆప్‌పై పంజాబ్‌ గురి
నేడు ఐపీఎల్‌-10లో ముంబై vs పంజాబ్‌. ప్లే ఆఫ్‌ ఆశలను నిలుపుకోవడంపై పంజాబ్‌ గురిపెట్టింది.

రుతుపవనాల రాక
ఆంధ్రప్రదేశ్‌లోకి ఐదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. జూన్‌ 10 కల్లా రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయని చెప్పింది.

>
మరిన్ని వార్తలు