కారు బోల్తా, 11మంది దుర్మరణం | Sakshi
Sakshi News home page

కారు బోల్తా, 11మంది దుర్మరణం

Published Thu, May 11 2017 8:52 AM

కారు బోల్తా, 11మంది దుర్మరణం - Sakshi

జబల్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11మంది దుర్మరణం చెందగా, మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. జబల్‌పూర్‌లో ఈరోజు ఉదయం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో గతరాత్రి ఓ కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement