పోలీస్‌స్టేషన్‌లో యువతి దారుణహత్య

18 Apr, 2017 10:06 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గతరాత్రి పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. ఓ భూవివాదం కేసుకు సంబంధించి ప్రత్యర్థులు ఆ యువతిని పోలీసులు, స్థానికుల కళ్ల ఎదుటే పాశవికంగా దాడి చేసి, హతమార్చారు. తను కాపాడాలంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు, అరణ్య రోదనే అయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు