సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

12 Jul, 2019 13:28 IST|Sakshi

సిడ్నీ, ఆస్ట్రేలియా :  ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ సిడ్నీ విభాగం అధ్యక్షులు శ్రీరంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో  వైఎస్సార్‌ అభిమానులు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పర్రామట్టలోని  పార్క్‌లో కేక్‌ కట్‌ చేసి  సంబరాలు చేసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వెళ్లిన మంగళగిరి నాయకులు, ప్రవాసాంద్రులు పాల్గొని వాళ్ల ఆనందాన్ని పంచుకున్నారు. ​ఈ సందర్భంగా సభ్యులు  మాట్లాడుతూ.. 2016 లో సిడ్నీ విభాగం ఆద్వర్యం స్థాపించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుతుండటం ఆనందంగా ఉందన్నారు.

ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం చాలామందికి ఉత్సాహానిచ్చిందన్నారు. వైఎస్సార్‌ వేడుకలతో పర్రామట్ట ప్రాంతం అంతా హోరేత్తిందన్నారు. అంతేగాక రాష్ట్ర చరిత్రలోనే జగన్‌ పాలన చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ ఒక నాయకుడుగా, ముఖ్యమంత్రిగా  ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోతారని స్పష్టం చేశారు. ఈ వేడుకలకు వైఎస్సార్సీపీ  సిడ్నీ విభాగం సభ్యులు గోవిందరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, తిమ్మారెడ్డి, శిరీష్‌, దామోదర్‌, రాకేష్‌, కిరణ్‌, సునీల్‌, కౌటిల్‌, సత్య, కమల్‌, అరవింద రెడ్డి, విజయ్‌ దంటూ, శ్యామ్‌, ఇంద్ర, సతీష్‌, తరుణ్‌, వేణు, శివారెడ్డి, వీరేంద్రనాథ్‌తోపాటు, మహిళా విభాగం సభ్యులు భారతి రెడ్డి, మను రెడ్డి, సుజాత, లతా, స్రవంతి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు