సింగపూర్​లో ఘనంగా పీవీ శత జయంతి వేడుకలు

1 Jul, 2020 16:25 IST|Sakshi

కౌలాలంపూర్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను సింగపూర్​ ఎన్నారై టీఆర్ఎస్​ ఆధ్వర్యంలో సింగపూర్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి వెంకట రమణారెడ్డి, బైర్నేని రావు రంజిత్​ మాట్లాడుతూ బహుభాషావేత్త, రచయిత, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావు సేవలను గుర్తుచేసుకున్నారు. కుంటుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కొనియాడారు. దేశానికి ఎనలేని సేవ చేసిన పీవీని భారతరత్నతో గౌరవించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల మద్దతిస్తామని చెప్పారు.

ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న సీఎం కె.చంద్రశేఖర్ రావుకి సింగపూర్​ ఎన్నారై తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాల మురళి మోహన్ రెడ్డి, మాచాడి రవీందర్ రావు, వీరమల్ల క్రిష్ణ ప్రసాద్, బద్దం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు