సాక్షి, హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు ముఖ్య అతిథులుగా విచ్చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. తానా మహాసభల అధ్యక్షుడు సతీశ్ వేమన, ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్చందర్రావు తానా సభల ఆహ్వాన పత్రికను వారికి అందించారు. జూలై 4 నుంచి జూలై 6 వరకు వాషింగ్టన్లో తానా సభలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. మంత్రులు శ్రీనివాస్గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది.