ఏపీ సీఎం అమెరికా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న చెవిరెడ్డి

14 Aug, 2019 13:00 IST|Sakshi
ఏర్పాట్లను పరిశీలిస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

డల్లాస్‌: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్ నగరంలో ముఖ్యమంత్రి పాల్గొనబోయే సభా ప్రాంగణాన్ని, ఏర్పాట్లను తుడా చైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ప్రభుత్వ కార్యక్రమం కాకున్నా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్ ఆగష్టు 17న ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రసంగించనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికా పర్యటన కొనసాగనుంది.  (చదవండి: బహుదూరపు బాటసారి అమెరికాయానం...)

మరిన్ని వార్తలు