టీఆర్‌ఎస్‌లో వర్గ పోరాటం

28 Jul, 2018 15:35 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ పోరాటం భగ్గుమంది. గుండాల మండలం టీఆర్‌ఎస్‌లో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో గుండాల టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి ఖదీర్‌పై మండల అధ్యక్షుడు భాస్కర్‌ శనివారం దాడిచేశాడు. ఖదీర్‌పై భాస్కర్‌ కర్రలతో దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఖదీర్‌ గుండాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు