సాక్షి, అమరావతి : పవన్ కళ్యాణ్ ఎన్ని నాటకాలాడినా చేసేదేమి లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నాడు ప్రత్యేక హోదా పాచి పోయిన లడ్డూ అన్న పవన్ నేడు ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధం అంటున్నాడని విమర్శించారు. బీజేపీ స్క్రిప్టుకు అనుగుణంగా పవన్ నటిస్తున్నాడని విమర్శించారు.
దమ్ముంటే పోలవరంలో అవినీతి జరిగిందని పవన్ చేసిన ఆరోపణల్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందన్నారు.ఉద్దేశ్ పూర్వకంగానే పవన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీజేపీ సమావేశాలకు పవన్ హాజరవుతున్నారని ఆయన ఆరోపించారు.