రాయపూర్: ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్దయాళ్ యూకీ శనివారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ప్రముఖ గిరిజన నాయకుడైన రామ్దయాళ్ పార్టీని విడటం కాంగ్రెస్ పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. పాలి తానాఖర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆయన ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
ఛత్తీస్గఢ్లో రెండు దశల్లో అసెంబీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 18 స్థానాల్లో నవంబర్ 12న, మిగతా 72 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11న ఓట్లను లెక్కిస్తారు.