నేను ఇప్పటికీ మధ్యప్రదేశ్‌ సీఎంనే : చౌహాన్‌ 

15 Dec, 2018 17:20 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సీట్ల తేడాతో అధికార బీజేపీ పరాజయం పాలవడం తెలిసిందే. ఓటమిని హుందాగా అంగీకరిస్తూ సీఎం పదవికి శివరాజ్‌ సింగ్‌ రాజీనామా కూడా చేశారు. అయినప్పటికీ తాను  మధ్య ప్రదేశ్‌ సీఎంనేనని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే తాను ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌ చీఫ్‌ మినిస్టర్‌( సీఎం) కాదని, కామన్‌ మ్యాన్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ అని పేర్కొన్నారు.

తన ట్విటర్‌లోని బయోడేటాలో చీప్‌ మినిస్టర్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ను తొలగించి కామన్‌ మ్యాన్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ అని చేర్చారు. ‘ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నా గుడి, రాష్ట్ర ప్రజలు నా దేవుళ్లు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ ప్రజల కోసం తెరచే ఉంటాయి. ఏ సమస్య వచ్చినా ఎలాంటి సంశయం లేకుండా నా దగ్గరకు రావోచ్చు. ఎప్పటిలాగే మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తా’ అని ట్విటర్‌లో చౌహాన్‌ పేర్కొన్నారు. 

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 సీట్లు గెలుచుకోగా, అధికార బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు 116 స్థానాలు అవసరం కావడంతో ఎస్‌పీ(1), బీఎస్‌పీ(2), స్వతంత్రులు(4) లతో కలిపి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మధ్యప్రదేశ్‌ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరిన్ని వార్తలు