మట్టి తవ్వి తీయడానికి రూ.13 వేల కోట్ల ఖర్చా?

3 Aug, 2018 12:43 IST|Sakshi
బీజేపీ నేత సోము వీర్రాజు(పాత చిత్రం)

తూర్పుగోదావరి జిల్లా: నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మట్టి తవ్వి తీయడానికి రూ.13600 కోట్లు ఖర్చు చేశారా అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..తవ్విన మట్టిని కూడా టీడీపీ నాయకులు అమ్మేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబూ నిన్ను పంచభూతాలు గమనిస్తున్నాయి..జాగ్రత్త అని హెచ్చరించారు.

పాఠశాలలకు సున్నం వేయడానికి మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే..ఏకంగా రూ.120 కోట్లు మింగేశారని ఆరోపించారు. ఇదో భారీ కుంభకోణమని వ్యాఖ్యానించారు. స్కూలు యూనిఫారాల టెండర్‌ రూ.250 కోట్లకు మరో వ్యక్తికి కట్టబెట్టారు..ఇదో కుంభకోణం అని అవినీతి ఆరోపణలు గుప్పించారు.

మరిన్ని వార్తలు