పత్తికొండ, డోన్‌ స్థానాలకు అభ్యర్థుల ఖరారు

22 Feb, 2019 22:07 IST|Sakshi

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. నిన్న రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెల్సిందే. ఈరోజు కేఈ, కోట్ల కుటుంబాల వారితో సంప్రదింపులు జరిపారు. వారికి కేటాయించే సీట్లపై స్పష్టతనిచ్చారు. పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాలు కేఈ కుటుంబానికి, కర్నూలు పార్లమెంటు, ఆలూరు అసెంబ్లీ స్థానాలు కోట్ల కుటుంబానికి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

కర్నూలు అసెంబ్లీ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు, ఆథోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు విడివిడిగా మాట్లాడుతున్నారు. వీటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్‌ నుంచి కేఈ ప్రతాప్‌, ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ బరిలోకి దించనున్నారు. కర్నూలు పార్లమెంటు స్థానం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి ఖరారైంది.

మరిన్ని వార్తలు