చిలుకూరు ఆలయంలో టీ-వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలనికోరుతూ ఆ పార్టీ ఐటీ విభాగం ఆదివారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
హైదరాబాద్లోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆలయంలో 101 కొబ్బరికాయలుకొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లా మధుసూదన్, కొండా రాఘవరెడ్డి సహా పలువురు ఐటీ వింగ్ సభ్యులు పాల్గొన్నారు.