2న నెల్లూరులో ‘వంచన గర్జన’

1 Jun, 2018 11:54 IST|Sakshi
శిల్పా చక్రపాణిరెడ్డి, , బీవై రామయ్య

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నెల్లూరులో జూన్‌ 2న నిర్వహించే ‘వంచన గర్జన’కు జిల్లా నుంచి అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు  తరలి రావాలని ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మోసపూరిత విధానాలు, విభజన హామీలు అమలు చేయని ఎన్‌డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘వంచన గర్జన’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరులోని వీఆర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో శనివారం 9 గంటలకు నిర్వహించే నిరసన దీక్షలో నలుపు రంగు దుస్తులు ధరించి పాల్గొనాల్సి ఉందని తెలిపారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిరసన దీక్ష కావడంతో పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

మరిన్ని వార్తలు