సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫుట్బాల్ సంఘం (టీఎఫ్ఏ)అధ్యక్షునిగా మొహమ్మద్ అలీ రఫత్ మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన టీఎఫ్ఏ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చైర్మన్గా కేటీ మహి, అధ్యక్షునిగా మొహమ్మద్ అలీ రఫత్, కోశాధికారిగా జీపీ ఫల్గుణను ఎన్నుకున్నారు. ఎన్పీ వెంకటేశ్, మొహమ్మద్ ముస్తఫా అలీ, ఎస్. ఆంథోని ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. సంయుక్త కార్యదర్శులుగా మొహమ్మద్ ఖలీల్ అహ్మద్, పి. శ్రీనివాస్ రెడ్డి, బి. ప్రసాద్... కోశాధికారిగా కేఈ (ట్ఛ uఛిౌట), సహాయ కార్యదర్శిగా చంద్రశేఖర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ కార్యవర్గం నాలుగేళ్లపాటు పదవిలో ఉంటుంది.