క్వార్టర్‌ ఫైనల్లో మనీశ్, ఆశిష్, సచిన్‌

6 Mar, 2020 01:17 IST|Sakshi

అమ్మాన్‌ (జోర్డాన్‌): టోక్యో ఒలింపిక్స్‌ ఆసియా క్వాలిఫయింగ్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో గురువారం బరిలోకి దిగిన ముగ్గురు భారత బాక్సర్లు అదరగొట్టారు. మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), సచిన్‌ కుమార్‌ (81 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు విజయం దూరంలో నిలిచారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మనీశ్‌ 5–0తో చు ఎన్‌ లాయ్‌ (చైనీస్‌ తైపీ)పై, ఆశిష్‌ 5–0తో ఒమర్‌బెక్‌ బెక్‌జిగిట్‌ యులు (కిర్గిస్తాన్‌)పై నెగ్గగా... డీ ఇవోపో (సమోవా)ను సచిన్‌ ఓడించాడు.

మరిన్ని వార్తలు