అండర్–11 చెస్ సెలక్షన్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్సీఏ) ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ జిల్లా అండర్–11 చెస్ సెలక్షన్ టోర్నీలో ప్రణీత ప్రియ, సంకేత్ రెడ్డి చాంపియన్లుగా నిలిచారు. టీఎస్సీఏ కార్యాలయం వేదికగా జరిగిన ఈ టోర్నీ బాలికల విభాగంలో 4 పాయింట్లతో ప్రణీత అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తలపడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఎస్. అనీష్క, జి. ఇషాన్వి, జి. శరణ్య వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి హైదరాబాద్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు.
బాలుర విభాగంలో నిర్ణీత 5 రౌండ్లకుగానూ 5 పాయింట్లు సాధించి సంకేత్ విజేతగా నిలిచాడు. ఎస్. చిద్విలాస్ రెండోస్థానాన్ని దక్కించుకోగా... కె. అవనీశ్, విశ్వ తర్వాతి స్థానాలను సాధించారు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ నలుగురూ హైదరాబాద్ జిల్లా బాలుర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్లు రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తాయి.