తొలి రౌండ్‌లోనే పరాజయం

22 Mar, 2018 16:24 IST|Sakshi

మియామి:ప‍్రపంచ మాజీ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. మియామి ఓపెన్‌లో భాగంగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ నుంచే సెరెనా నిష్ర్కమించింది.

జపాన్‌కు చెందిన నయోమి ఒసాకాతో జరిగిన పోరులో సెరెనా 3-6, 2-6 తేడాతో ఓటమి పాలైంది. గంటా 17 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఓసాకా దాటికి సెరెనా ఏమాత్రం సమాధానం ఇవ్వలేకపోయింది. దాంతో మియామిలో సత్తాచాటాలనుకున్న సెరెనా ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి.

మరిన్ని వార్తలు