మెద్వేద్‌ అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నీ ఫైనల్లో సాక్షి

16 Sep, 2018 05:11 IST|Sakshi

రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, భారత స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మలిక్‌ మెద్వేద్‌ అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బెలారస్‌లో శనివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం సెమీఫైనల్లో సాక్షి 6–2తో ఎల్మీరా గంబరోవా (అజర్‌బైజాన్‌)పై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో సాక్షి 7–2తో లైస్‌ న్యూన్స్‌ ఒలివీరా (బ్రెజిల్‌)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మరియానా సస్తిన్‌ (హంగేరి)తో సాక్షి తలపడుతుంది. 

మరిన్ని వార్తలు