25 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ

20 Jul, 2016 10:16 IST|Sakshi
25 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ

చెన్నై: వండలూర్ జూలో ఓ కొండచిలువ 25 పిల్లలకు జన్మనిచ్చింది. వండలూరు అన్నా జువాలజికల్ పార్కులో 25 కొండచిలువలు సంరక్షణలో ఉన్నాయి. అందులోని ఒక ఆడ కొండచిలువ ఏప్రిల్ 8వ తేదీ 45 గుడ్లుపెట్టింది. అందులో గత నెల 23న 20 గుడ్ల నుంచి 20 కొండచిలువ పిల్లలు బయటకు వచ్చాయి.

అనంతరం ఈ నెల 18న మరో 25 గుడ్ల నుంచి 25 కొండచిలువ పిల్లలు వచ్చాయి. ప్రస్తుతం వీటితో కలిపి మొత్తం కొండచిలువ పిల్లల సంఖ్య 45కు చేరింది. సరాసరి బరువు 89.28 గ్రాములు ఉన్న ఈ కొండచిలువ పిల్లలు సుమారు 28 అడుగుల పొడవు వరకు పెరిగే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు