పోలీసు వాలీబాల్ పోటీలు ప్రారంభం

12 Dec, 2016 15:25 IST|Sakshi

విశాఖపట్నం: వైజాగ్ పోర్టు స్టేడియంలో 65వ అఖిల భారత పోలీసు వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏపీ ఉపముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప సోమవారం ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, పారామిలటరీ దళాల నుంచి 40 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఐదురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సుమారు 2400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, ఏపీ డీజీపీ ఎన్.సాంబశివరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు