మెడ్‌టెక్‌ జోన్‌లో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌

18 Nov, 2023 04:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సౌత్‌ ఈస్ట్రన్‌ రీజియన్‌ పైప్‌లైన్‌ (ఎస్‌ఈఆర్‌పీఎల్‌) పరిధిలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మొట్టమొదటి లిక్విఫైడ్‌ కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌సీఎన్‌జీ) స్టేషన్‌ను విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటు చేసింది.

ఈ గ్యాస్‌ స్టేషన్‌ను ఇండియన్‌ ఆయిల్‌ సంస్థకు చెందిన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌(సీజీడీ) బృందం శుక్రవారం ప్రారంభించింది. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లోని ఎల్‌సీఎన్‌జీ హబ్‌ ద్వారా ఏపీ రీజియన్‌కు సంబంధించిన సీఎన్‌జీ అవసరా­లను తక్షణమే తీర్చడంతోపాటు నేచురల్‌ గ్యాస్‌ లభ్యత, నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు