హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఖమ్మం పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 31వ తేదీన తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్తండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ట్రయల్రన్ను విజయవంతంగా నడిపిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది.