హత్య కేసులో ఇద్దరికి బెయిల్ నిరాకరణ

21 Dec, 2013 23:15 IST|Sakshi

న్యూఢిల్లీ: అట్లాంటిక్ సముద్రంలో ఓ పడవలో  నేవీ కెప్టెన్‌ను హత్య చేసిన కేసులో అరెస్టయిన ఇద్దరికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది తీవ్రమైన నేరమన్న జస్టిస్ కైలాశ్ గంబీట్, జస్టిస్ ఇందర్‌మీట్ కౌర్ నేతృత్వంలోని ధర్మాసనం వివేక్ మందోక్, శంకర్ భాటియాలకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. 2004, ఏప్రిల్ నాలుగున ఓ పడవలోని తన కేబీన్‌లో ఉన్న కెప్టెన్ రాజన్ అగర్వాల్‌ను హత్య చేసిన వివేక్, శంకర్‌లు మృతదేహాన్ని సముద్రంలోకి విసిరేశారు. 

>
మరిన్ని వార్తలు